ఏప్రిల్‌లో చంద్రబాబు చైనా టూర్

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వం ఆహ్వానం మేరకు చంద్రబాబు చైనా వెళ్తున్నారు. భారతదేశం నుంచి తమ దేశంలో పర్యటించడానికి బృందాన్ని పర్యటించాల్సిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ చంద్రబాబుకు లేఖ రాసింది. దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. చైనా పర్యటనలో చంద్రబాబు వెంట 15 మందితో కూడిన బృందం వుంటుంది. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, సీఎంవో కార్యదర్శులు సతీష్‌చంద్ర, సాయిప్రసాద్‌లతో పాటు కొంతమంది పార్లమెంట్‌ సభ్యులు కూడా చైనా పర్యటనకు వెళ్ళే బృందంలో వుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చైనా పర్యటన తోడ్పడే అవకాశాలున్నాయి.