సీఎం సీటు కోరిన చిరు

 

 

 

ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి జోరందుకున్నాయి. రాష్ట్ర విభజనకి నిరసనగా రాజీనామా చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు మొదలు పెట్టింది. సీఎం సీటు కోసం ఇరుప్రాంత కాంగ్రెస్ నేతలు ఢిల్లీ లో లాబీయింగ్ లు మొదలుపెట్టారు. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ తో భేటి అయిన కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీకి పునరుత్తేజం కల్పిస్తానని హామి ఇచ్చారట. ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ ఆయనకి వివరించినట్లు సమాచారం. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ కూడా దిగ్విజయ్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.