అంజిరెడ్డి కి చిరంజీవి నివాళి
posted on Mar 16, 2013 11:05AM
అనారోగ్యంతో కన్నుమూసిన రెడ్డీస్ ల్యాబ్ అధినేత అంజిరెడ్డి బౌతికకాయనికి కేంద్రమంత్రి చిరంజీవి దంపతులు నివాళులర్పించారు. ఆయన కుంట సభ్యులను పరామర్శించారు. అంతకముందు సీపీఎం ఎమ్యెల్యే జూలకంటి రంగారెడ్డి అంజిరెడ్డి బౌతికకాయనికి నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం అంజిరెడ్డి అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో జరగనున్నాయి.
1943లో గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి 1984లో రెడ్డీ ట్యాబ్ను ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. భారతీయ ఔషద పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఔషాధాల తయారీలో ప్రపంచానికే గుర్తింపు తీసుకు వచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.