కేంద్రమంత్రి చిరంజీవికి ఓటర్ల షాక్

 

మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి జూబిలీహిల్స్ ఓటర్లు షాక్ ఇచ్చారు. కుటుంబంతో కలసి జూబిలీహిల్స్ లోని పోలింగ్ బూత్‌కి వెళ్ళిన చిరంజీవి మొదట కుటుంబంతో కలసి క్యూలోనే నిలబడ్డారు. అయితే కొంతమంది ‘స్వామిభక్తులు’ చిరంజీవిని డైరెక్ట్ గా వచ్చి ఓటు వేయమని ఆహ్వానించారు. దాంతో చిరంజీవి కుటుంబం క్యూలోంచి బయటకి వచ్చి డైరెక్ట్ గా పోలింగ్ బూత్‌లోకి వెళ్ళబోయింది. అయితే అక్కడ క్యూలో వున్న ఓటర్లు చిరంజీవి అలా డైరెక్ట్ గా వెళ్ళిపోవడాన్ని అడ్డుకున్నారు. మీరూ మాలాంటి ఓటరేనని, మీరు కేంద్రమంత్రి అయినంత మాత్రాన మీకు ప్రత్యేకత లేదని, ఓటు వేసే దగ్గర ప్రొటోకాల్ వుండదని స్పష్టం చేశారు. దాంతో చిరంజీవి నాలుక్కరుచుకుని ఓటర్లకు సారీ చెప్పి, మళ్ళీ కుటుంబంతో కలసి క్యూలో నిల్చుని వెళ్ళి ఓటు వేశారు.