పలు కంపెనీల ఉద్యోగుల్ని ఆకర్షిస్తున్న చిన్న జియర్ స్వామి...

 

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి పలు రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సేవలను మెచ్చిన పలు కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్ లు స్వామి వారికి ఆకర్షితులవుతున్నారు. స్వామీజీ చేస్తున్న సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కంపెనీల సెక్రటరీలు కోరారు. ట్రస్టు పేరుతో మారుమూల ప్రాంతాల్లో సైతం చినజీయర్ స్వామి చేసిన సేవలను పలు కంపెనీల ప్రతి నిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. హైదరాబాద్ మాదాపూర్ లో వికాస తరంగిణి పేరుతో పలు కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్ లు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చినజీయర్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఇలాంటి సేవలలో భాగస్వాములు కావాలనుకుంటున్నామని కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యంతో పాటు తాగు నీరు అందించడంలో జీయర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచటానికి జీయర్ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కంపెనీల సెక్రటరీలు చార్టర్డ్ అకౌంటెంట్ లు అభిప్రాయపడ్డారు.ఇలా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ వైఖరిని గొప్పగా మార్చుకోవాలని,తాము తమ జీవితాల్లో పది మందికి సాయం చేస్తూ మంచిగా బ్రతికాలని పలు కంపెనీ నేతలు ఆదేశిస్తున్నారు.