మా వైపు కూడా మరణాలు.. ఫైనల్ గా ఒప్పుకున్న చైనా రాయబారి

జూన్ 15 న భారత్-చైనా సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తమ దేశ సైనికులు కూడా మరణించారని భారత్ లోని చైనా రాయబారి సున్ వీడాన్గ్ మొట్టమొదటి సారి బహిరంగంగా ఒప్పుకున్నారు. రెండు దేశాల సైనికుల మధ్య బాహా బాహీగా జరిగిన ఘర్షణ లో చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని అయన తెలిపారు. ఐతే వారి సంఖ్యను మాత్రమే అయన ప్రకటించలేదు. చైనా వైపు జరిగిన సైనిక నష్టం బయటకు తెలిస్తే మళ్ళీ రెండు దేశాల పౌరుల మధ్య ఘర్షణ వాతావరణం మరింత పెరిగే అవకాశం ఉండడంతో తమ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదని అయన న్నారు.