పార్లమెంట్లో చిదంబరం బడ్జెట్...గందరగోళం

 

 

 

స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. చిదంబరం స్పీకర్ కు సీరియల్ నెం. 1 ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై బిల్లు ప్రవేశపెడుతున్నట్టు స్పీకర్ కు తెలిపారు. అలాగే గులాం నబీ ఆజాద్ కూడా సీరియల్ నెం. 2 గా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. చిదంబరం ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పార్లమెంటు ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సమైక్య నినాదాలతో సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు కావూరి, పురందేశ్వరి వెల్ లోకి దూసుకెళ్లారు. సమైక్యాంధ్ర ప్లే కార్డ్ లు పట్టుకుని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా చిదంబరం తన ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడుతున్నారు. స్పీకర్ సభ్యులను పలుమార్లు సహకరించాలని కోరినా వుయ్ వాంట్ జస్టీస్ అంటూ సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు నినాదాలతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారు.