త్వరలోనే ధరలు దిగివస్తాయి : చిదంబరం

 

నేడు లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు సభలో నిరసనకు దిగారు. సమైక్యాంద్ర నినాదాలు చేస్తూ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్యనే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చిదంబరం బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది. త్వరలోనే ధరలు దిగివస్తాయని, ఆహార ఉత్పత్తులు పెరిగాయి. కష్టపడి పనిచేయడం వల్లే వృద్ధిరేటు పెరిగింది. బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వ రంగంలో 10లక్షల ఉద్యోగాలు. దేశంలో 50వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయని ఆయన అన్నారు.