మంత్రి గారబ్బాయికి మర్యాదలు

 

రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ వారసుడు..చిరంజీవి వారసునిగా టాలీవుడ్లో ఈజీ విక్టరీస్ కొడుతున్న రామ్ చరణ్ పొలిటిక్స్ లో కూడా బాగానే చక్రం తిప్పుతున్నాడు.. ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగంలో మంచి ఫాలోయింగ్ అందుకున్న చెర్రీ ఇప్పుడు కేంద్రమంత్రి తనయుడిగా పొలిటికల్ ఫాలోయింగ్ ను కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నాడు..


గతంలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరైన చరణ్ కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా చాలా మంది రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు లేచి నిలబడి మరీ స్వాగతం పలికారు..ఇప్పుడు అదే తరహాలో అఖిల భారత యాదవ మహాసభకని ఆంద్రప్రదేశ్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పొలిటికల్ లీడర్స్ తో పాటు రామ్ చరణ్ ను కూడా పలకరించి వెళ్లారు..


దీంతో తన సినీ వారసునిగా చరణ్ నిలబెట్టిన చిరు, తన రాజకీయ వారసునిగా కూడా ఇప్పటి నుంచే చెర్రీని రెడీ చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.. ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా కేవలం ఓ మంత్రిగారబ్బాయికి మర్యాదలు చేయటం మాత్రం ఏం బాలేందటున్నారు ప్రజలు.