నాకు టికెట్ ఇవ్వాల్సిందే: హరికృష్ణ

 

 

 

ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరోసారి పార్టీలో హడావిడి సృష్టించడానికి సిద్ధమయ్యారు. హిందూపురం టిక్కెట్ తనకి కేటాయించాలని చంద్రబాబుని ఓ పదిరోజుల క్రితం హరికృష్ణ కోరినప్పటికీ చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతకుముందు కృష్ణాజిల్లాలోని పెనమలూరు స్థానాన్ని కోరినప్పుడు కూడా ఆయన మాటని పట్టించుకునే వారే లేకుండా పోయారు. దాంతో హరికృష్ణ హడావిడి సృష్టించడానికి రంగంలోకి దిగారు. తాను ఏ స్థానం నుంచి టిక్కెట్ అడిగినా ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనకు టికెట్ ఇవ్వకపోగా..తాను టికెట్ అడగలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే పార్టీలో తన త్యాగాన్ని గుర్తించినవారే లేకుండా పోయారని ఆయన బాధపడిపోతున్నారు. హరికృష్ణ వ్యక్తం చేస్తున్న ఈ ఆవేదనని అయినా పట్టించుకునేవారు తెలుగుదేశం పార్టీలో వున్నారో లేరో!