స్పీకర్ పై మండిపడ్డ చంద్రబాబు

 

 

 

టి.డి.పి. అదినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై తీవ్ర విమర్శలు చేసారు. టి.డి.పి.కి జరిగిన అవమానం పై చంద్రబాబు మాట్లాడుతూ...స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు. సభలోకి మీడియాకు మరియు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక నియంతలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుక్క తోక అని విపక్షాలను తిడితే, కనీసం క్షమాపణలు కూడా చెప్పించకుండా స్పీకర్ విదిచిపెట్టేసాడని ఆయన అన్నారు. ఈ విధంగా ప్రవర్తిస్తున్న స్పీకర్ పై అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.