విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ
posted on Feb 27, 2020 11:29AM
విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు విజయనగరంలో ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు అమరావతి నుంచి విశాఖకు విమానంలో వెళ్లారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
అయితే, భారీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లడంతో విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాల వ్యక్తులు నచ్చజెప్పిఅక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది.