టీఆర్ఎస్‌కి వీఆర్ఎస్సే: గజ్వేల్‌లో చంద్రబాబు గర్జన

 

 

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో ఇంతకాలం సంయమనం పాటించిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల ప్రచార వేళ ముగుస్తున్న సమయంలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా గర్జించారు. ఆ గర్జన కూడా అక్కడో ఎక్కడో కాకుండా, కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే గర్జించారు. ఆ గర్జనలివిగో...

తెలంగాణలో దొరలరాజ్యం పోవాలి.

కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా.

గజ్వేల్ నీ జాగీర్ అనుకుంటున్నావా కేసీఆర్?

గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ఊదితే గోదావరిలో పడతావ్.

కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో అవినీతి పంట పండిస్తున్నాడు.

తెలంగాణకి ద్రోహం చేస్తున్న ప్రధాన వ్యక్తి కేసీఆర్.

కేసీఆర్ అంతు చూస్తా.

మోడీనీ, నన్ను తిడతావా.. ఖబడ్డార్.