సహాయక చర్యలో స్వయంగా పాల్గొన్న చంద్రబాబు

 

తుఫాను ధాటికి కళావిహీనంగా మారిన విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు సందర్శించారు. తుఫానుకు దెబ్బతిన్న రాడార్ కేంద్రం గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కైలాసగిరిలో జరుగుతున్న సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. చిందరవందరగా పడివున్న చెట్లను రంపంతో కోసి ఆ ప్రాంతాన్ని చదును చేశారు.