చంద్రబాబు ను కలిసిన బాలకృష్ణ
posted on Feb 21, 2013 8:57AM
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 21న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక తిరిగి పాదయాత్రలు ప్రారంభమవుతాయి. దీంతో గుంటూరు జిల్లా వేమూరులో చంద్రబాబు పాదయాత్ర నిలిపివేసి బసచేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఆయనను కలిశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. రెండు గంటల పాటు ఆయనతో మాట్లాడిన అనంతరం బయటకు వచ్చి కొందరు ప్రముఖులతో మాట్లాడారు. మళ్లీ బాబు ఉన్న వాహనంలోకి వెళ్లి మధ్యాహ్నం ఒంటిగంటకు వేమూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఐదురోజుల క్రితం మెట్లు కూలిపోయి చంద్రబాబు కిందపడే సమయంలో అంగరక్షకులు రక్షించారు. ఇక పాదయాత్ర లో చంద్రబాబు కాళ్లనొప్పులు, షుగర్, బీపీలతో ఇబ్బంది పడుతున్నారు.