చంద్రబాబు బీసీ మంత్రం

 

చంద్రబాబు నాయుడు మరోసారి బీసీ మంత్రం జపించేందుకు సిద్ధమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడే చంద్రబాబు తన మదిలోని మాటను చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీతో కలిసి పనిచేసే విషయమై తమ సంఘం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్. కృష్ణయ్య చెప్పారు. బీసీలను సీఎం చేస్తామని ప్రకటించిన టీడీపీపై ఎవ్వరూ విమర్శలు చేసినా సహించేది లేదన్నారు.