మాట మార్చిన చంద్రబాబు

 

కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అవసరమయితే వచ్చే నెల 10వ తేదీ నుండి జరగనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అసమ్మతి తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటింఛి ఒక కొత్త చర్చకు తెర తీసారు. కానీ, నిన్న జరిగిన మహానాడులో ఇప్పుడు అంత అవసరం లేదనట్లు మాట్లాడారు. వైకాపా నేతలు తనకీ కిరణ్ కుమార్ రెడ్డికి మద్య రహస్య ఒప్పందం ఉందంటూ చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికే బహుశః ఆయన ఎత్తువేసి ఉండవచ్చును. కానీ, వైకాపా నేతలందరూ గత రెండు రోజులుగా జగన్ మోహన్ రెడ్డి జైల్లో నిర్బందించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిరసన దీక్షలు ర్యాలీలతో బిజీగా ఉన్న సమయం చూసుకొని చంద్రబాబు మళ్ళీ ఈ ఉపసంహరణ ప్రకటన కూడా చల్లగా చేసారనుకోవచ్చును.