చంద్రబాబు ఓటు చెల్లదు: ఇ.సి. భన్వర్‌లాల్

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూబిలీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, పొత్తు ధర్మం ప్రకారం తాను బీజేపీకి ఓటు వేశానని, అటు అసెంబ్లీకి గానీ, ఇటు పార్లమెంట్‌కి గానీ తమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో లేనందున తమ మిత్ర పక్షమైన బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ ఓటు ఎవరికి వేసింది బయటకి చెప్పకూడదు. అయితే చంద్రబాబు తాను ఓటు బీజేపీకి వేసినట్టు చంద్రబాబు ప్రకటించడంతో ఆయన ఓటు చెల్లదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ప్రకటించారు.