తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర



రాష్ట్రంలో ఏర్పాడ్డ అనిశ్చితి నేప‌ధ్యంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మ‌రోసారి యాత్రకు సిద్దమ‌వుతున్నారు. ఈ సారి బ‌స్సులో రాష్ట్రవ్యాప్త ప‌ర్యట‌న చేయ‌నున్న ఆయ‌న ఈ యాత్రకు తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర‌గా నామ‌క‌ణం చుశారు. తెలంగాణ కు అన్ని పార్టీలు అనుకూలంగానే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రక‌టించిన తీరు త‌రువాతి ప‌రిణామాల‌ను ఈయాత్రలో ప్రజ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

చంద్రబాబు నిర్వహించిన పాట పాద‌యాత్రకు మంచి స్పంద‌న వ‌చ్చిన నేప‌ధ్యంలో ఇప్పుడ చేప‌ట్టబోయే ఆత్మ గౌర‌వ యాత్రకు సూప‌ర్ స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజ‌ల అభిప్రాయ‌న్ని గౌర‌వించి తెలంగాణకు అనుకూలంగా ప్రక‌ట‌న చేశాం గాని ఇలా సీమాంద్రకు అన్యాయం చేయ‌మ‌న‌లేద‌న్నారు.

రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్‌తోనూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల‌ను క‌లిసి రాష్ట్రప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నారు.