చక్రితో నాకు గొడవలు లేవు.. చక్రి భార్య శ్రావణి..

 

సంగీత దర్శకుడు చక్రి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం ఆస్తి వివాదాల్లో పడింది. చక్రి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు తనను ఆస్తికోసం వేధిస్తున్నారని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసే వరకూ విషయం వెళ్ళింది. ఈ నేపథ్యంలో చక్రిని ఆయన భార్య శ్రావణి విషం పెట్టి చంపారన్న విమర్శలకు కూడా చక్రి తల్లిదండ్రులు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రావణి చక్రితో తన అనుబంధాన్ని గురించి చెప్పారు. చక్రి, తాను పదేళ్ళ క్రితం ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నామని, అప్పటి నుంచి ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని ఆమె చెప్పారు. చక్రికి, తనకు ఎప్పుడూ గొడవలు జరగలేదని, తామిద్దరం ఎంతో అన్యోన్యంగా వుండేవారమని ఆమె తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే చక్రి తన ముఖాన్నే చూసేవారని, కళ్ళు మూసుకునే శ్రావణీ ఎక్కుడున్నావంటూ పిలిచి తన ముఖాన్ని చూసే మంచం దిగేవారని శ్రావణి చెప్పారు. అలాంటి తాను తననెంతో ప్రేమించే తన భర్తను ఎందుకు చంపుకుంటానని శ్రావణి ప్రశ్నించారు. తనకు డబ్బు అక్కర్లేదని.. తాను డబ్బును ఆశించే మనిషిని కాదని ఆమె తెలిపారు.