పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి

ఎన్ని సార్లు చావుదెబ్బలు తిన్నా పాక్ సైన్యం తన బుద్ది మార్చుకోవడం లేదు. వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా ఇవాళ జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో పాక్ రేంజర్లు భారత పోస్టులపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటైన జవాబిస్తోంది. అయితే పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక సైనికుడు తుదిశ్వాస విడిచారు.