రంజిత్ సిన్హాకి సుప్రీంకోర్టు తాఖీదులు...

 

అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడ్డట్టు అందరికీ నోటీసులు ఇచ్చే సీబీఐ డైరెక్టర్‌కే నోటీసులు జారీ అయ్యాయి. 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వారితో భేటీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కుంభకోణం నిందితులతో భేటీ అయిన ఆయన్ని సీబీఐ డైరెక్టర్గా తొలగించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు. ఈ ఆరోపణలపైసంబంధించి పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ‘సుప్రీం’ రంజిత్ సిన్హాను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.