సీఎం జగన్ కి మళ్లీ షాకిచ్చిన సీబీఐ కోర్టు!!

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చుక్కుదురైంది. తనపై ఉన్నఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్ పై.. ఈరోజు కోర్టు విచారణ జరిపింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్న సీఎం జగన్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 31 కి వాయిదా వేసింది. దీంతో ఇకపై జగన్ కోర్టుకి హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.