కవిత మీద కేసు పెట్టండి... నాంపల్లి కోర్టు...

 

జమ్ము - కాశ్మీర్, తెలంగాణ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు పోలీసులను ఆదేశించింది. కవిత దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత విద్వేషపూరితంగా ఉన్నాయని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కరుణాసాగర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 124 ఏ, 153 బి, 505 సెక్షన్లకింద కేసు నమోదు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 11వ తేదీ లోపల దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.