పవన్ కళ్యాణ్ తుఫాను సహాయం 50 లక్షలు

 

ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘‘విశాఖను, ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన ఈ హుదూద్ తుఫాన్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరాంధ్ర సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా కృషి చేసి విపత్తుకు గురైన వారిని ఆదుకోవలసిన సందర్భం అని నేను భావిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విపత్తును అధిగమించడానికి చేస్తున్న కృషికి నావంతు సహకారాన్ని అందిస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధికి నావంతు సహకారంగా 50 లక్షల రూపాయలను అందిస్తున్నాను. నా ఫ్యాన్స్‌ని, మద్దతుదారులను తుఫాను సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా  కోరుతున్నాను. త్వరలో నేను కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తాను’’ అన్నారు.