పాక్ కే భారీ నష్టం..

 


జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ రేంజర్లు తరచూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. వీరికి భారత సైన్యం కూడా బాగానే సమాధానం చెబుతున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎఫ్ ద‌ళాలు చేసిన దాడిలో పాకిస్థాన్‌కు చెందిన బంక‌ర్ ధ్వంస‌మైనట్టు తెలుస్తోంది.  దానికి సంబంధించిన వీడియో ఫూటేజీని విడుద‌ల చేశారు. ఈ సందర్బం బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ మాట్లాడుతూ.. భార‌త్ ఆర్మీ జ‌రిపిన దాడుల వ‌ల్ల పాక్‌లో భారీ న‌ష్ట‌మే వాటిల్లిన‌ట్లు తెలిపారు. చాలా ప‌క్క‌గా భార‌త‌ ద‌ళాలు దాడుల్లో పాల్గొంటున్నాయ‌ని, దాని వ‌ల్లే పాక్ ఆర్మీకి భారీ న‌ష్టం క‌లిగింద‌ని, సాధార‌ణ పౌరుల‌ను తాము టార్గెట్ చేయ‌లేద‌ని బీఎస్ఎఫ్ అధికారి వెల్ల‌డించారు. పాకిస్థాన్‌లో ఉన్న మిలిట‌రీ పోస్ట్‌ల‌ను మాత్ర‌మే తాము టార్గెట్ చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా గత కొద్ది  రోజులుగా రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న సంగతి తెలిసిందే.