తప్పు చేసి బాబును తప్పుపట్టిన బొత్స

 

పీసిసి అధ్యక్షులుగా యావత్ రాష్ట్ర పార్టీకి బాద్యత వహించవలసిన బొత్స సత్యనారాయణ నిన్న రాజమండ్రీలో ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన జై ఆంధ్ర మహా సభలో పాల్గొనడం మొదటి తప్పయితే, హిందీ వాళ్ళకి పది రాష్ట్రాలు ఉన్నపుడు తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని లౌక్యంగా ప్రశ్నిస్తూ పార్టీలో తెలంగాణావాదులనుండి ఇబ్బందులు రాకుండా ఇంతవరకు కాలక్షేపం చేసేసిన ఆయన సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభలో పాల్గొంటూ పరోక్షంగా వారికి తన మద్దతు ప్రకటిస్తూ, సభలో చంద్రబాబును లక్ష్యం చేసుకొని ప్రసంగించడం మరో తప్పు. చంద్రబాబు రెండుకళ్ళ సిద్దాంతం అంటూ ఇంతకాలం కాలక్షేపంచేసి హటాత్తుగా ప్లేటు పిరాయించి తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇవ్వడాన్ని అయన తప్పు పట్టారు. అయితే తానూ ఆ సభకి వచ్చి తన రెండు రాష్ట్రాల వాదనను వదిలిపెట్టి సమైక్యాంద్రా వైపు ప్లేటు పిరాయిన్చినట్లు మాత్రం అయన బహిరంగంగా ప్రకటించకపోయినా ఆ విషయాన్ని తెలంగాణా వాదులు మాత్రం బాగానే అర్ధం చేసుకొన్నారు. పార్టీ అధ్యక్షపదవిలో ఉంటూ యావత్ రాష్ట్ర పార్టీకి బాద్యత వహించవలసిన అయన సమైక్యాంద్రావాదుల సభకి హాజరవడం తెలంగాణా వాదులు బాహాటంగానే ఖండించారు కూడా.