భువనగిరి థియేటర్ లో బాంబు ...?

భువనగిరిలోని భద్రాది థియేటర్ లో మార్నింగ్ షో సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారు సినిమా టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళుతుండగా గేటు దగ్గర సిబ్బంది వారిని ఆపి వారి చేతిలోని బ్యాగ్ చూపించావలసిందిగా కోరారు. కానీ ఆ నలుగురూ బ్యాగ్ తెరవకుండానే వెనుతిరిగి పోతుండగా సిబ్బందికి అనుమానం వేసి వారిని నిలదీసి బ్యాగ్  చూపించాలని పట్టుబట్టారు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు పరుగుప్రారంభించడంతో థియేటర్ కి వచ్చిన వారు పట్టుకోవాలని ప్రయత్నించారు. ముగ్గురు వ్యక్తులు పారిపోగా ఒకతన్ని పట్టుకుని భువనగిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. డి.ఎస్.పి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సి.ఐ. మధుసూదనరెడ్డి విచారణ ప్రారంభించారు. విచారణ తరువాత డి.ఎస్.పి. మాట్లాడుతూ వారు తీవ్రవాదులు కారని మహారాష్ట్రలోని షోలాపూర్ కి చెందినవారని, వారు చిల్లర దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు. మిగిలిన ముగ్గురి గురించి పట్టుబడ్డ వ్యక్తి ద్వారా వివరాలు సేకరిన్స్తామని చెప్పారు.