టర్కీ బాంబు పేలుడు.. 30 మంది గాయాలు..

 

టర్కీలో తరచూ పేలుళ్లు సంభవిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో పేలుడు జరిగింది. దియార్‌బాకిర్ సిటీలోని పోలీస్ కార్యాల‌యానికి స‌మీపంలో బాంబు పేలింది. ఈ పేలుడిలో ఒకరు మృతి చెందగా మ‌రో 30 మంది గాయ‌ప‌డ్డారు. పేలుడు వ‌ల్ల స‌మీపంలో ఉన్న నాలుగు బిల్డింగ్‌లు భారీగా ధ్వంసం అయ్యాయి. కాగా  పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీల‌ను అరెస్టు చేసిన కొన్ని గంట‌ల‌లోపే పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. అది కూడా కుర్దులు ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలోనే ఈ పేలుడు చోటుచేసుకున్న‌ది.