తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు..!

 

 

 

తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపిందని కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ చెప్పారు. ప్రధాని బుధవారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో తన నివాసంలో భేటీ ఏర్పాటు చేసారు. విందు సమావేశం ముగిసిన అనంతరం కమల్‌నాథ్‌ మీడియతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే తేదీపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ నేతలు తెలంగాణకు తమ పార్టీ అనుకూలమంటూనే.. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించిన తర్వాతే బిల్లుకు మద్దతిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నాయకులు రోజుకో మాట చెబుతున్న నేపధ్యంలో.. ఏ విషయాన్ని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లు నోరువిప్పితేనే తెలంగాణ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.