హిందూ జాతి నిర్మూలనకు కుట్ర... రాజాసింగ్ సంచలన కామెంట్స్...

తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. హిందూ సంతతి పెరగకుండా ఇతర మతస్థులు, విదేశీయులు ... ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలు కలుపుతున్నారంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ ఫుడ్ ప్రొడక్ట్స్ తినడం వల్లే హిందువుల్లో చాలా మందికి పిల్లలు పుట్టడం లేదన్న రాజాసింగ్ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండియాలో హిందువనే వాడే లేకుండా, మొత్తం హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని రాజాసింగ్ హెచ్చరించారు. హిందువుల సంతతి పెరగకుండా విదేశాలు, ఇతర మతస్థులు... ఫుడ్ ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ కలుపుతున్నారంటూ రాజాసింగ్ చేసిన ఆరోపణలు దేశంలో కొత్త చర్చకు దారి తీశాయి.

ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అవుతోన్న ఆహార ఉత్పత్తులపై రాజాసింగ్ అనుమానాలు వ్యక్తంచేశారు. జంక్ ఫుడ్స్ కారణంగా సంతానలేమి సమస్య ఏర్పడుతోందంటూ వైద్యులు సైతం హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.