వికసించిన కమలం.. వణుకుతున్న హస్తం

 

 

 

దేశవ్యాప్తంగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా లభిస్తున్న మద్దతుతో కమలం వికసించింది. దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ హస్తం గడగడా వణుకుతోంది. బీజేపీ కూటమికి 339 స్థానాలలో ఆధిక్యం దక్కింది. బీజేపీ కూటమి ధాటికి కాంగ్రెస్ పార్టీ కకావికలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మహామహులు అడ్రస్ లేకుండా పోయారు. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఓటమి దాకా వెళ్ళి బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కూడా ఓడిపోవడం శుభ పరిణామం.