చంద్రబాబుపై కేసులు.. కోర్టులకు సమయం చాలదు.!!

 

ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని.. చంద్రబాబుపై కేసులు వేస్తే కోర్టులకు సమయం చాలదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవన్నారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని విమర్శించారు. ప్రకృతి వ్యవసాయాన్ని గోవా సీఎం మనోహర్ పార్రికర్ ప్రవేశపెట్టారని.. దాన్ని ఐరాసలో తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.