రాహుల్ కి రేవంత్ కోచింగ్
posted on Oct 20, 2018 1:00PM
టీడీపీ, కాంగ్రెస్ నేతలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సీఎం రమేష్ హీరోలా బిల్డప్ ఇస్తున్నారని, ఉత్తమ్కుమార్రెడ్డి ఉత్తముడేమీ కాదని విమర్శించారు.ఐటీ సోదాలతో రేవంత్రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని, రేవంత్రెడ్డి భూదందాలు, అక్రమాలకు పాల్పడ్డారని జీవీఎల్ ఆరోపించారు
రాహుల్ పర్యటనపై కూడా జీవీఎల్ విమర్శలు చేశారు.రాహుల్గాంధీ తెలంగాణలో అడుగుపెట్టే ముందు.. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెప్పాకే ఓట్లడగాలన్నారు.'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇమ్మోరల్ నేషనల్ కరెప్ట్ కాంగ్రెస్' అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీలో దందాలు చేసేవారికి మంచి గుర్తింపు ఉందన్నారు.రాహుల్ గాంధీపై భూ కబ్జాల కేసులు ఉన్నాయని, ఆయన రేవంత్రెడ్డి దగ్గర కోచింగ్ క్లాసులు తీసుకుంటారేమోనని అభిప్రాయపడ్డారు. నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఇచ్చిన భూముల్లో అక్రమాలు జరిగాయని జీవీఎల్ ఆరోపించారు.దక్షిణాది ప్రజలంటే కాంగ్రెస్కు చులకనని ఆరోపించారు.రాహుల్కు పాకిస్తాన్ మీద ప్రేముంటే అక్కడే వెళ్లొచ్చని.. తమకే అభ్యంతరం లేదన్నారు.రాహుల్ గాంధీ ఎంత ఎక్కువగా తెలంగాణలో ప్రచారం చేస్తే తమకు అంత లాభమన్న జీవీఎల్.. గుజరాత్, కర్ణాటకల్లో అదే జరిగిందన్నారు.