90 శాతం ఆన్ లైన్లొనే పంపారు... బీజేపీకి రూ.700 కోట్ల విరాళాలు 

 

దేశంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతోన్న బీజేపీ.. ఆర్థికంగానూ బలపడుతోంది. బిజెపికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 700 కోట్ల మేరకు విరాళాలు అందినట్లు సమాచారం. వివిధ సంస్థలు, ట్రస్టుల ఈ మొత్తం అందినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన రిపోర్టులో బిజెపి స్వయంగా వెల్లడించింది. ఈ మొత్తం వచ్చిన విరాళాల్లో సగం టాటా సంస్థల నుండి రావడమే గమనార్హంగా మారింది.  టాటా సన్స్ అనుబంధ సంస్థగా ఉన్న ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి దాదాపు రూ. 356 కోట్లు.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ. 54.25 కోట్లు విరాళంగా బిజెపికు లభించింది.

ఇక కమలనాధులకు విరాళాలు ఇచ్చిన సంస్థల్లో భారతీ గ్రూప్, డీఎల్ఎఫ్ ,  ఓరియంట్ సిమెంట్స్, హీరో మోటార్ కార్ప్, జేకే టైర్స్ , జూబిలెంట్ ఫుడ్ వర్క్ తదితర సంస్థలూ ఉన్నాయి. రూ. 20 వేలను మించిన విరాళాలను ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరించామని బీజేపీ వెల్లడించింది. విరాళంగా వచ్చిన మొత్తంలో 90 శాతం పైగా ఆన్ లైన్ లొనే వచ్చాయి. అందులో బ్లాక్ మని ఉందనే ఆలోచన కూడా విపక్షాలు ప్రస్తావించకుండా బీజేపీ ఇలా చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.