బాబు సర్కార్ పై పురంధేశ్వరి ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తనకు అనేక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి... మరోసారి కీలక కామెంట్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆమె ఆరోపించారు, టీడీపీ ప్రభుత్వం గడువులోగా నివేదిక పంపకపోవడం వల్లే... కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరిగిందన్నారు. జగన్ దీక్షపై కూడా కామెంట్స్ చేసిన పురంధేశ్వరి.... ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడతున్న డ్రామా అంటూ విమర్శించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి లేకపోయినా, అధిక నిధులు కేటాయిస్తూ ఏపీని కేంద్రం ఆదుకుంటోందని గుర్తుచేశారు.