మటను, సెల్‌ఫోనుల వల్లే రేప్‌లు: బీహార్

 

మంత్రి సమాజంలో పెరిగిపోతున్న మానభంగాలకు కారణాలేంటో రాజకీయ నాయకులు చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. అమ్యాయిలపై అత్యాచారాలు పెరిగిపోవడానికి నాన్‌వెజ్ ఫుడ్, సెల్ ఫోన్లే కారణమని బీహార్‌కి చెందిన మంత్రి అభిప్రాయపడ్డాడు. బీహార్ యువజన వ్యవహారాల శాఖ మంత్రి బినయ్ బిహారీ ఈ విషయం మీద తన అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, మాంసాహారం మనిషిలోని కామ ప్రకోపాన్ని పెంచుతుందట, అలాగే సెల్ ఫోన్లలో నీలి చిత్రాలు చూడడ్డం వల్ల కూడా యువతరంలో కామ ప్రకోపం పెరుగుతోందట. ఈ రెండు కారణాల వల్లే దేశంలో రేప్‌లు ఎక్కువయ్యాయట. ఈ రెంటినీ బంద్ చేస్తే ఇక రేపులనేవే వుండవట. శాకాహారంతో శరీరం, మనస్సు నిశ్చలంగా ఉంటాయనీ ఆయన చెప్పారు. అలాగే పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం అంటే, ఆత్మరక్షణ పేరుతో తుపాకీ లైసెన్స్ ఇవ్వడమేనని అన్నారు.