కానిస్టేబుల్ పాడెను మోసిన ముఖ్యమంత్రి..

 

భోపాల్ సెంట్రల్ జైలు నుండి 8మంది ఉగ్రవాదులు పారిపోయి ఆతరువాత ఎన్ కౌంటర్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే వారు పారిపోయేముందు హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ ను చంపేసి పారి పోయారు. ఈనేపథ్యంలో ఈరోజు ఆయన భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. రమాశంకర్ కు నివాళి అర్పించి, అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతేకాదు, రమాశంకర్ పాడెను మోసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అతని కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని... అతని కుమార్తె వివాహానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలిపారు.