సీఎం కటౌట్‌కి గాజులు..

మధ్యప్రదేశ్‌లో మహిళల ఆత్మాభిమానం దెబ్బతింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కటౌట్‌కే గాజులు తొడిగారు.  రాష్ట్రంలో మగువలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలతో పాటు నీటి సంక్షోభంపై మహిళా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు సీఎం నివాసం ముందు గాజులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సేకరించిన మూడు లక్షల గాజులను ప్రదర్శనగా తీసుకొచ్చి వాటిని సీఎం కటౌట్లకి తొడిగి ప్రదర్శించారు. తాగునీటి సరఫరాలోనూ, మహిళల భద్రత పట్ల సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు.