ముగ్గురు ఉగ్రవాదులు హతం...

 

భారత సరిహద్దుల్లో పాక్ తరచూ కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు అప్పుడప్పుడు దేశంలోని చొరబాట్లకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దేశంలోకి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. బారాముల్లాలోని రాంపూర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తుండగా సైన్యం అప్రమత్తమైంది. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏకే -47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.