రాజకీయాల్లోకి రానున్ననిర్మాత..

 

నటునిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత కమెడియన్ గా ఎదిగిన వ్యక్తి బండ్ల గణేష్. గబ్బర్ సింగ్ , టెంపర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి బడా నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. బొత్స సత్యనారాయణకు సన్నిహితుడిగా, బినామీగా అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కొన్నేళ్లుగా చిత్రసీమ కి దూరమైన బండ్ల కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహూల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా... బండ్ల గణేష్‌తోపాటు టీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌తోపాటు ఆయా పార్టీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదిలా ఉండగా.. షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది.