అలిగిన దత్తాత్రేయ.. మెట్రో రైలు మధ్యలోనే దిగిపోయారు..!!

 

ఈ రోజు అమీర్‌పేట - ఎల్బీనగర్ మెట్రో రైలు మార్గం ప్రారంభమైన విషయం తెలిసిందే. గవర్నర్‌ నరసింహన్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని, కేటీఆర్, తలసాని తో పాటు.. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం గవర్నర్‌ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. ఈ సమయంలో దత్తాత్రేయ అలకబూనినట్టు తెలుస్తోంది. మెట్రో రైలుపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మెట్రో రైలు ఎంజీబీఎస్‌ స్టేషన్‌కు రాగానే దత్తాత్రేయ మధ్యలో దిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. అనంతరం గవర్నర్, మంత్రులు ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌ను పరిశీలించారు.