బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలంటూ వార్తలు
posted on Mar 16, 2013 12:46PM
నందమూరి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఇంకా సమసిపోలేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విజయవాడలో ఓ జ్యుయలరీ షాపు ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఎన్టీఆర్ కు అభిమానులే మోటార్ బైక్ లతో ర్యాలీగా తీసుకెళ్లారు. అయితే ఆయనకు సినీ అభిమానులు తప్ప తెలుగుదేశం పార్టీ నేతలుగాని, కార్యకర్తలు గానీ ఎవరూ స్వాగతం పలకకపోవడం పట్ల ఆ కుటుంబంలో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
టిడిపి కార్యకర్తలు జూనియర్ పర్యటనకు దూరంగా ఉండాలని బాలకృష్ణ సన్నిహితులు సంకేతాలు ఇచ్చారని కధనాలు రావడం ఆసక్తికరంగా ఉంది. నిజంగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.ల మధ్య అంతరం ఏర్పడిందా? అయితే ఇది వరకే తనకు సన్నిహితుడు అయిన కొడాలి నాని పార్టీని వీడి జగన్ పార్టీలో చేరినా జూనియర్ టీడీపీకే మద్దతు పలికారు. తన తాత పార్టీకే తన మద్దతు అని, అది తెలుగువారి ఆత్మగౌరవం అని ప్రకటించారు.