బాహుబలి సినిమా లీక్... కేసు పెట్టిన రాజమౌళి
posted on Jan 30, 2015 7:16PM
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గత ఏడాదిన్నరగా శిల్పం చెక్కినట్లు ఎంతో శ్రద్దగా చేకుతున్న బాహుబలి సినిమా నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న సమయంలో దానిలో కొన్ని సీన్లను ఎవరో లీక్ చేయడంతో కలకలం మొదలయింది. తక్షణమే దర్శకుడు రాజమౌళి హైదరాబాద్ లోని సైబర్ క్రీం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ప్రస్తుతం పోలీసులు యూని సభ్యులందరినీ విచారణ చేస్తున్నారు. వారిలోనే ఎవరో ఒకరు రహస్యంగా చిత్రీకరించో లేకపోతే ఎడిటింగ్ ల్యాబ్ నుండి దొంగిలించో లీక్ చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ సినిమాలో చాలా భారీ సెట్టింగులు వేసారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అందువలన నిర్మాతలు ఈ సినిమాపై ఇప్పటికే దాదాపు రూ.200 కోట్లు వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సినిమా రిలీజ్ కి సిద్దం అవుతోంది అనుకొంటున్న సమయంలో ఇలా జరగడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.