కేసిఆర్ రాజకీయ గురువు నేనె: బాబు

 

 

 

తెలంగాణ తెలుగుదేశం త్వరలో ఖాళీ అవడం ఖాయమని వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఖాళీ అవడానికి తెలుగుదేశం పార్టీ బ్రాందీ సీసా కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదవాళ్ళకు అందాల్సిన నిధులను కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, సోనియా గాంధీయే అవినీతి అనకొండని ఆరోపించారు. టిడిపి హయంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకశాలు కల్పించమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత టిడిపిదేనని గుర్తుచేశారు. కేసిఆర్ పార్టీ పెట్టినప్పుడు అతని ఆస్థి ఎంతని? ఇప్పుడు ఎంతని? ప్రశ్నించారు. కేసిఆర్ రాజకీయ గురువు తానేనని, మంచి దారిలో వెళ్తాడని అనుకుంటే..అడ్డదారిలో వెళ్తున్నాడని అన్నారు.