బులంద్‌షహర్‌ గ్యాంగ్ రేప్... ఆజంఖాన్‌ క్షమాపణ చెప్పాల్సిందే..

 

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, యూపీ మంత్రి ఆజంఖాన్‌ బులంద్‌షహర్‌ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోయిడాకు చెందిన ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు కారును ఆపి అందులో ఉన్న తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆజంఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయంపై బాధితురాలైన బాలిక ఆజంఖాన్‌ను విచారించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు అత్యాచార బాధితురాలికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. బాధితురాలు చదువుకునేందుకు వీలుగా దగ్గర్లోని పాఠశాలలో ప్రవేశం కల్పించాలని ఆదేశించింది.