భారత్‌లో అల్ ఖైదాకి అంతసీన్ లేదు... అమెరికా..

 

భారత ఉప ఖండంలో అల్ ఖైదా శాఖను ప్రారంభించబోతున్నామని అల్ ఖైదా నాయకుడు అల్ జవహరి ప్రకటించడాన్ని భారత ముస్లిం మత పెద్దలు తీవ్రంగా ఖండించారు. సున్నీ మార్క్‌జ సీరత్ కమిటీ, ఇతర స్థానిక ముస్లీం గ్రూపులకు చెందిన ప్రతినిధులు ఈ మేరకు ఒక లేఖను, భద్రకాళీ పోలీస్ స్టేషన్లో అందించారు. ముస్లిం సమాజానికి భారత్ ప్రియమైనదని, జాతీయ సమైక్యతను వారంతా బలపరుస్తూ వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమ ప్రాణాలకంటే మిన్నగా దేశాన్ని ప్రేమిస్తున్నామన్నారు. అది ఎల్లప్పుడు కొనసాగుతుందన్నారు. అల్‌ఖైదాకు భారత్‌లో స్థానం లేదని వాషింగ్టన్ భారతీయ అమెరికన్ ముస్లిం మండలి పేర్కొంది. మరోవైపు అమెరికా కూడా ఈ ప్రకటన ఉనికి నిరూపించుకోవడానికే చేసిన ప్రకటనగా భావిస్తోంది.