పత్తికొండ వద్ద ప్రమాదం.. ఐదుగురి మృతి

 

కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పత్తికొండ పట్టణంలో నివాసముండే పదిమంది చిరు వ్యాపారులు వ్యాపారం నిమిత్తం వివిధ గ్రామాలకు వెళ్ళడానికి ఆటోలో బయల్దేరారు. పత్తికొండ శివారులోని ఆదోని రోడ్డులో గుత్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఆటోను ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు నలుగురు మహిళలు మరణించారు.