కెసిఆర్ హత్యకు కుట్ర
posted on Aug 6, 2013 7:50PM
తెలంగాణ ప్రకటన నేపధ్యంలో తమ నాయకుడు కెసిఆర్కు ప్రాణ హాని ఉందని టిఆర్ ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందన్న టిఆర్ఎస్ నాయకులు కెసిఆర్కు జెడ్ ప్లస్ క్యాటగిరి సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ మీద ఈగ వాలినా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందన్నారు ఆ పార్టీ నాయకుడు ఈటెల రాజేందర్.
కెసిఆర్పై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిందన్న రాజేందర్ ఆయనకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ నాలుగున్నర కోట్ల ఆశాకిరణం, అందుకే ఆయనను హతా మార్చాలని విద్రోహ శక్తులు ప్రయత్రిస్తున్నాయన్నారు. ఈ మేరకు ఇప్పటికే సుపారిలు కూడా అందాయని ఆ సమాచారం తమ దగ్గర ఉందని అడిషనల్ డిఐజి ఆ సమాచారాన్ని అందిస్తామని ప్రకటించారు.
ఈ కుట్ర పై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించటంతో పాటు కెసిఆర్కు తగిన భద్రత కల్పించాలన్నారు. కెసిఆర్కు ఏం జరిగినా అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాద్యత వహించాలన్నారు.