జపాన్‌లో మోడీ విస్తృత పర్యటన...

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన జపాన్ పర్యటనలో భాగంగా మూడో రోజు అక్కడి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ ఆర్థికగతిని మార్చిన పారిశ్రామికవేత్తల మధ్య ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. విశ్వమానవ కళ్యాణానికి జపాన్ అందించిన సాయం ఎనలేనిదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరిశోధన రంగంలో జపాన్ తో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా జపాన్ పారిశ్రామివేత్తలతో కలిసిన పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. తమ దేశంలో జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే మోడీ జపాన్‌లోని 136 సంవత్సరాల క్రితం స్థాపించిన ఓ పురాత స్కూల్‌ని సందర్శించి, అక్కడి టీచర్లు, విద్యార్థులతో మాట్లాడారు.